మహాభారతాన్ని తెరకెక్కించాలని కల

మహాభారతాన్ని తెరకెక్కించాలని కల

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి విజయవంతమైన చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి భారీ బడ్జెట్ మల్టి స్టారర్ చిత్రం RRR. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరు కూడా రెండు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది జులై లో విడుదల చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇకపోతే ఇటీవల తన సోదరుడు కీరవాణి కుమారులు ఇద్దరు కలిసి ఒక భాగంగా మత్తు వదలరా అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే.

కాగా ఈ ‘మత్తు వదలారా’ చిత్ర యూనిట్‌తో దర్శకుడు రాజమౌళి తాజాగా ఒక చిట్ చిట్ నిర్వహించారు. ఈమేరకు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా రాజమౌళి సమాధానం చెప్పుకొచ్చారు. కాగా ఈమేరకు మాట్లాడిన రాజమౌళి, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే, తప్పకుండ కొత్త వారితో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తానని వెల్లడించారు. ఇకపోతే మహాభారతాన్ని తెరకెక్కించాలని ఎప్పటినుండో కలగా ఉందని, కానీ దాన్ని ఒక ఎపిసోడ్ మాదిరి కాకుండా, మహాభారతం మొత్తాన్ని ఒక సినిమాగా తీస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు మొదలు పెడతారు అనే కొత్త ప్రశ్న అందరి మదిని తొలిచేస్తోంది.