విమర్శలు ఎదురుకుంటున్న రాజమౌళి

విమర్శలు ఎదురుకుంటున్న రాజమౌళి

టాలీవుడ్  దర్శక ధీరుడు రాజమౌళిపై మరో దర్శకుడు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌లలో ఒకడిగా ఉన్న రాజమౌళి చాలా మంది నుంచి విమర్శలు ఎదురుకుంటున్నాడు. అయితే దీనికి కారణం లేకపోలేదు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్ పొందిన పారాసైట్ చిత్రంపై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.

పారాసైట్ సినిమా బోర్ కొట్టిందని, సినిమా చూస్తూ అలానే పడుకుని పోయానని, స్లోగా ఉండే సినిమాలంటే నాకు నచ్చవని కూడా చెప్పాడు. ఉత్తమ విదేశీ చిత్రంగా, ఉత్తమ ద‌ర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల‌లో అస్కార్ అవార్డ్ గెలుచుకున్న సినిమాపై రాజమౌళి నెగిటివ్ కామెంట్స్ చేయడంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో యువదర్శకుడు ప్రశాంత్ కిషోర్ కూడా రాజమౌళిపై సీరియస్ కామెంట్స్ చేశారు. పారాసైట్‌ చిత్రాన్ని చాలా మంది దర్శకులు ప్రశంసించారని, బాహుబలి గురుంచి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు నేనెక్కడా వినలేదని అన్నాడ్ ఉ. పారాసైట్ చిత్రం వాస్తవిక‌త‌కి అద్దం ప‌ట్టేలా ఉందని అంటూనే, ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే సై సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని రాజమౌళి కాపీ చేసారని అన్నారు.