పులుసును ఆటాడేసిన రకుల్ ప్రీత్

కరోనాతో సెలబ్రిటీలు అంతా వారి ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో  ఏమీ తోచక ఏదేదో చేస్తున్నారు. రోజుకూ ఛాలెంజ్ లనీ… ఆటలనీ.. పాటలనీ విసిరేస్తున్నారు. మరికొంతమంది వింతైన ఆటలు ఆడుకుంటున్నారు. మరికొంతమంది వంటలు చేసుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన బ్రిలియంట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా.. తన తమ్ముడు అమన్ తో కలిసి.. చిన్నప్పుడు ఆడిన ఆటలను నెమరు వేసుకుంది. ఆలోకంలోకి వెళ్లి చిన్నపిల్లై ఆడుతూ అల్లరి అల్లరి చేసింది. అంతటితో ఆగకుండా అందుకు సంబంధించిన వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
కాగా తాను చేసిన యోగా వీడియోలను, సరదాగా చేసిన వీడియోలను ఇప్పటికే పోస్ట్ చేసిన రకుల్, తాజాగా పలు రకాల ఆటలను ఆడుతున్న వీడియోను పెట్టగా ఇప్పుడది నెట్టింట్లో వైరల్ అయింది. అమన్ తో కలిసి ‘దిండూ – దెబ్బ’, ‘కబడ్డీ’, ‘పులుసు’ ఆటలు ఆడింది. ఇక ఈ ఆటలను చిన్నప్పుడు ఆడుకున్నానని.. ఆనాటి జ్ఞాపకాలలో తేలిపోయింది రకుల్ నారీమణి. అలనాటి మధురమైన చిలిపి చిలిపి జ్ఞాపకాలతో చేసిన ఈ వీడియో చాలా బాగా వైరల్ అవుతోంది. తనను ఆటలు బాల్యంలోకి తీసుకెళ్లాయని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.  కాగా ఆ వీడియోను చూడాలంటే ఇలా క్లిక్ చేయండి.