టాలీవుడ్ కి రాశీ చెక్.. కోలీవుడ్ లో బిజీ బిజీ..

రాశీఖన్నా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. అదేమంటే.. ఈ మధ్య టాలీవుడ్ లో రాశీఖన్నాపై విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అమ్మడిపై ఎన్నడూ లేనివిధంగా టాలీవుడ్ వార్తలను వడ్డించి వేస్తుంది. అందులో భాగంగా తాను వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమా చేయాల్సింది కాదు ఆంటూ ఆమె అన్నట్లుగా గాసిబ్ పుట్టించారు. ఆ తర్వాత వెంటనే ఆమె మన ఫెయిల్యూర్స్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుందని ఓ రకమైన కొటేషన్స్ ఇచ్చింది ముద్దుగుమ్మ. అయితే అమ్మడు పాజిటివ్ గానే స్పందించినప్పటికీ.. మళ్ళీ విమర్శలకు గురికాక తప్పడం లేదు.

అయితే ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిశ్రమకు పరిచయమైన రాశీఖన్నీ కెరీర్ మొదట్లో కాస్త బొద్దుగా ఉందనే కామెంట్స్ గుప్పుమన్నాయి. ఆ తర్వాత స్టార్ హీరోలతో అందుకే ఆఫర్స్ రావట్లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక మొత్తానికి ఎదో ఒక విధంగా బరువు తగ్గి నాజూగ్గా మారింది ఈ బ్యూటీ. కొంచెం కొంచెంగా స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటున్న ఈ సమయంలో వరుస అపజయాలు గట్టి దెబ్బతీస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అయితే కనీసం మంచి గుర్తింపు తీసుకురుకపోగా అమ్మడి ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. మొత్తానికి రాశి ఖన్నా తాజాగా ఓ నిర్ణయానికి వచ్చిందట. అదేమంటే..

సహనం కోల్పోయి కోపంతో తెలుగు ఇండస్ట్రీకి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది. అవసరమైతే స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తేనే సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యిందని టాక్ నడుస్తోంది. ఇక ఈ మధ్య అమ్మడికి తమిళ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే సూర్య నెక్స్ట్ సినిమా ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. అలాగే మరో రెండు స్టోరీలను ఓకే చేసేందుకు రెడీగా ఉందట. కాగా ఇప్పుడు టావీవుడ్ నుంచి పూర్తిగా కోలీవుడ్ కి షిఫ్ట్ అవుతోన్న రాశీఖన్న అక్కడ ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.