మేఘాతో పని చేయడం నాకూ కిక్‌ ఇచ్చింది

మేఘాతో పని చేయడం నాకూ కిక్‌ ఇచ్చింది

‘‘డియర్‌ మేఘ’’ అద్భుతమైన రొమాంటిక్‌ ఫిల్మ్‌. ఇలాంటి రొమాంటిక్‌ లవ్‌స్టోరి ఈ మధ్య కాలంలో రాలేదు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. మేఘా ఆకాష్, అదిత్‌ అరుణ్, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. అర్జున్‌ దాస్యన్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 3న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ..‘‘మేఘా ఆకాష్‌ 40 ఏళ్ల కిందట కనిపించి ఉంటే నాకు విడాకులు అయ్యేవి కావు.

ఆమె చాలా క్యూట్‌గా, హోమ్లీగా ఉంది.నా సినిమాలకు సెట్‌ అవ్వదు. అరుణ్‌ అదిత్‌తో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారితో పని చేయడం ఆర్జీవీగారికి ఎంత కిక్‌ ఇచ్చిందో, మేఘాతో పని చేయడం నాకూ అంతే కిక్‌ ఇచ్చింది’’ అన్నారు సుశాంత్‌ రెడ్డి. ‘‘ఈ సినిమా అమ్మాయి వైపు నుంచి కథను చెబుతుంది’’ అన్నారు అర్జున్‌ దాస్యన్‌