డిల్లీలో పర్యటించనున్న కేసీఆర్‌

డిల్లీలో పర్యటించనున్న కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలారోజుల తర్వాత హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు దేశ రాజధాని దిల్లీలో ఆయన పర్యటించనున్నారు. సెప్టెంబరు 1న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్తారు. 2వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు దిల్లీ వసంత్‌విహార్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలోని 1300 గజాల స్థలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర నేతలు పాల్గొంటారు. ఆ రోజు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న కేసీఆర్ మూడో తేదీన తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో అనుమతి లభిస్తే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది.