ప్రారంభమయిన రెండో దశ పోలింగ్ !

polling

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతుంది. వాస్తవానికి రెండో దశలో భాగంగా 97 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దవడం, త్రిపురలోని త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానం ఎన్నిక మూడో దశకు (ఈనెల 23కు) వాయిదా పడడంతో రెండు స్థానాలు తగ్గాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తమిళనాడు-38, కర్ణాటక-14, మహారాష్ట్ర-10, ఉత్తరప్రదేశ్-8, అసోం, బిహార్, ఒడిశాల్లో 5 సీట్ల చొప్పున, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో 3 సీట్ల చొప్పున, జమ్ముకశ్మీర్‌లో 2 సీట్లు, మణిపూర్, పుదుచ్చేరిలో ఒక్కో సీటుకు పోలింగ్ జరుగుతుంది. అంతేకాకుండా ఒడిశాలో 35 శాసనసభ స్థానాలకు, తమిళనాడులో ఖాళీగా ఉన్నవాటిలో 18 శాసనసభ స్థానాలకూ, పుదుచ్చేరిలో ఒక శాసనసభ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్‌ జరుగుతోంది. రెండో దశలో మొత్తం 1,611 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.