టీమిండియాపై విజయం సాధించిన దక్షిణ ఆఫ్రికా

 టీమిండియాపై విజయం సాధించిన దక్షిణ ఆఫ్రికా

మూడో టీ20లో విజయం సాధించి సిరీస్‌ సొం‍తం చేసుకోసుకోవాలనుకున్న టీమిండియాకు సఫారీలు షాకిచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం  జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్‌ ధావన్‌ 36, రిషభ్‌ పంత్ 19, రవీంద్ర జడేజా 19 టాప్‌ స్కోరర్లు.

అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన దక్షిణాఫ్రికా కేవలం వికెట్‌ (రీజా హెన్రిక్స్‌ 28) మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ క్వింటన్ డీకాక్ 79 (6 బౌండరీలు, 5 సిక్సర్లు) తో విరుచుకుపడ్డాడు. అతనికి తోడు వన్డౌన్ బ్యాట్స్‌మన్ బావుమా (27) చెలరేగడంతో పర్యాటక జట్టు మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా) తీసిన బ్యూరెన్‌ హెన్రిక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. క్వింటన్ డీకాక్ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా ఎంపికయ్యాడు.