జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

ప్రముఖ వివాదాల నటి శ్రీరెడ్డి అంటే దాదాపుగా తెలియని వారు ఎవరు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. నిత్యం ఎవరినో ఓరిని టార్గెట్ చేసి, వారిపై కొన్ని సంచలన వాఖ్యలు చేసి, ఆ తరువాత వారిని దూషిస్తూ నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. కాగా ఇదివరకే దగ్గుబాటి ఫ్యామిలీని, మెగా ఫ్యామిలీని, మరికొందరు ప్రముఖులను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి తాజాగా మరొక ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేసి కొన్ని వాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ ప్రముఖ వ్యకి ఎవరో కాదు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… అయితే సీఎం జగన్ కి వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు చేయలేదు కానీ సీఎం జగన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ వేరే వాళ్ళని విమర్శించింది.

కాగా ఏపీలో అధికారాన్ని దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి చాలా విజన్ ఉన్న నాయకుడు అని, తన పాలనలో తన తండ్రినే మించిపోయాడని వాఖ్యానించిన శ్రీరెడ్డి జగన్ లాంటి నాయకుడు మనకు దొరకడం మన అదృష్టమని వాఖ్యానించారు. అయితే సీఎం జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్న కొందరు ప్రముఖులు సీఎం జగన్ పై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని, ప్రజలు మెచ్చిన నాయకుడిపై ఇలాంటి తప్పుడు వాఖ్యలు చేయడానికి సిగ్గులేదా అని శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీరెడ్డి చేసిన వాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిందని కొందరు రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు.