తెలంగాణా ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత…మూడంచెల భద్రత

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లలకు న్యాయం చేయాలంటూ భారీగా తల్లిదండ్రులు హైదరాబాద్ లోని బోర్డు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ‘లేదంటే మీ అందరిని అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో తమ పిల్లలకు న్యాయం ఎవరు చేస్తారని తల్లిదండ్రులు పోలీసులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని ఏజెన్సీకి పరీక్షల బాధ్యతలు అప్పగించి తమ పిల్లల భవిష్యత్తును ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ న్యాయమని నిలదీస్తున్నారు.