మెగాస్టార్ తో సుహాసిని వీడియో కాల్ జ్ఞాపకాలు వైరల్

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా అరంగేట్రం చేసినప్పటి నుంచి చాలా వేగంగా దూసుకుపోతున్నారు. శుభాకాంక్షలతో పాటు ఆయన గత జ్ఞాపకాలను సందర్భాన్ని బట్టి నెమరు వేసుకుంటున్నారు. తాజాగా కరోనా మహమ్మారితో లాక్ డౌన్ లో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనే ఆవరణాన్ని నీటితో శుభ్రం చేస్తూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత కరోనా కారణంగా జంట నగరాల్లో బ్లడ్ నిల్వలు జీరోకు చేరాయి. అనారోగ్యానికి గురైన వారు బ్లడ్ లేక నానా ఇబ్బందుకు పడుతున్నారు. దీంతో మెగాస్టార్ స్వయంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు బ్లడ్ డొనేట్ చేసి ఆ తర్వాత ఆ వీడియోను ట్విట్టర్ లో పెట్టి బ్లడ్ డొనేట్ చేయాలని సంకల్పంతో ఉన్నవారు స్వేచ్ఛగా అందుబాటులో సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి ఇవ్వవచ్చని.. అందుకు తగిన విధంగా పోలీస్ యంత్రాంగంతో కూడా తాను మాట్లాడానని.. అధికారులకు పోన్ చేస్తే వారే వచ్చి స్వయంగా మీకు సహకరిస్తారని… వీలైనంతమంది ఎక్కువగా బ్లడ్ డొనేట్ చేయమని చిరంజీవి పిలుపునిచ్చారు.

అదేవిధంగా తాజాగా చాలా ఆశ్చర్యం గొలిపేలా మధుర స్మృతులను జ్ఝాపకం తెచ్చుకొనేలా సుహాసిని వాట్సాప్ వీడియో కాల్ చేసి అది లైవ్ లో అందరికీ చూపిస్తూ షేర్ చేసుకోవడం అందులో చిరంజీవితో కావడం అభిమానులకు ఆనందం వేస్తుంది. తాజాగా సుహాసిని మెగాస్టార్ చిరంజీవికి కాల్ చేసి షూటింగ్ సమయంలో జరిగిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. తాను మొదట మీతో సెల్ఫీ దిగిన సందర్భం ఎక్కడ అని సుహాసిని అడిగిన వెంటనే చిరంజీవి కన్యాకుమారి షూటంగ్ లో అంటూ సమాధానమిచ్చారు. అప్పుడు సుహాసిని ఆనందానికి అంతులేదు.. వావ్ మీ మమొరికీ నా వందనం.. గ్రేట్ మైండ్ అంటూ సుహాసిని చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది.

అంతేకాకుండా మిమ్మల్ని అంతా ఇంకా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని అంటున్నారని చెప్పగా చిరంజీవి ఒక్కసారిగా నవ్వేశారు. మొదట్లో నేను మిమ్మల్ని కలిసింది కాలీ తమిళ సినిమా షూటింగ్ లో అని.. ఆ సమయంలో మీరు ఒక మూలన చాలా అమాయకంగా కూర్చొని ఉన్నారని ఇంకా మరెన్నో విషయాలు వీరిద్దరి మధ్య సంభాషణకు వచ్చాయి.