తిరువనంతపురంలో అనుమానాస్పద హత్య… సోదరుడే కారణమా?

తిరువనంతపురంలో అనుమానాస్పద హత్య... సోదరుడే కారణమా?
murder case in Thiruvananthapuram

తన సోదరుడిని హత్య చేసిన కేసులో 45 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు. తిరువనంతపురంలో నివాసముంటున్న బిను సోదరుడు రాజ్‌ మృతిలో అతడి పాత్రపై విచారణ జరుపుతున్నారు.

ఓనం సందర్భంగా వారి తల్లి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. తల్లి తిరిగి వచ్చినా, రాజ్ కనిపించకపోవడంతో తిరువల్లం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. పలు దఫాలుగా విచారించిన పోలీసులు బిను పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడంతో అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన సోదరుడిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని ఇంటి పెరట్లో వెలికితీశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రోజున అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. అది రాజ్ హత్యతో ముగిసింది. బినుకు మానసిక సమస్యలు ఉన్నట్లు తెలిపారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మృతదేహాన్ని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం తరలించారు.