టీడీపీ నేత సుబ్బారావు హత్య

టీడీపీ నేత సుబ్బారావు హత్య

కర్నూలు జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఒక దారుణం జరిగింది. కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం, వెలుంగుహుల ప్రాంతానికి చెందిన టీడీపీ నేత సుబ్బారావు అనే వ్యక్తిని, తన ప్రత్యర్థులు దారుణంగా వెంబడించి, వేటకొడవళ్లతో నరికి చంపారు. కాగా టీడీపీ నేత సుబ్బారావు తన అవసరాల నిమిత్తం ఒక్కరే వెళ్తున్నాడన్న సమాచారాన్ని అందుకున్న ప్రత్యర్థులు రెండు స్కార్పియో వాహనాల్లో అక్కడికి చేరుకొని, ఆయనను చుట్టుముట్టి, విచక్షణ రహితంగా, అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి, చంపేశారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ సుబ్బారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే గ్రానైట్ వ్యాపారం చేస్తున్నటువంటి సుబ్బారావు కి గత కొంత కాలంగా గనుల విషయంలో వేరే వర్గం వారితో గొడవలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటన కి సంబందించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు.