9 స్థానాలకు టీడీపీ టిక్కెట్ల ప్రకటన..! అవి మాత్రం పెండింగ్…!

AP CM Chandra Babu Inmates At Delhi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 9 మందితో తొలి జాబితాను అర్ధరాత్రి విడుదల చేసింది. మహాకూటమిలో భాగంగా తెదేపా 14కు స్థానాలు కేటాయించారు. ఇందులో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావు, సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావు పేట- మచ్చ నాగేశ్వర రావు, వరంగల్‌ పశ్చిమ- రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, మక్తల్‌- కొత్తకోట దయాకర్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌- ఎర్ర శేఖర్‌, ఉప్పల్‌- వీరేందర్‌ గౌడ్‌, శేరిలింగంపల్లి- భవ్య ఆనంద్‌ ప్రసాద్‌, మలక్ పేట – ముజఫర్ పేర్లనుప్రకటించారు. కూకట్ పల్లి స్థానం కూడా టీడీపీకే ఖరారయింది కానీ అక్కడ అభ్యర్థి విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి వచ్చినట్లు లేరు.

paddi-rteddy

అక్కడ్నుంచి పోటీ చేయడానికి సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి ఉత్సాహంగా ఉన్నారు. తానే పోటీ చేస్తానంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు.అయితే టీడీపీ క్యాడర్‌లో ఈ విషయంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క టీడీపీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుకు టిక్కెట్ కేటాయించాలని అక్కడి మెజార్టీ టీడీపీ నేతలు కోరుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ టిక్కెట్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఇది కాకుండా మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. కానీ టీడీపీకి ఏ నాలుగు స్థానాలు కేటాయిస్తారనేదానిపై క్లారిటీ లేదు.

mahakutami

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గాన్ని కూడా టీడీపీకి కేటాయించార అక్కడ్నుంచి మండల వెంకటేశ్వరరావు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ నిన్న ప్రకటించిన లిస్టులో ఆ పేరు లేదు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. టీడీపీకి క్లారిటీ రావాల్సిన నాలుగు నియోజకవర్గాలు జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, ఇబ్రహీంపట్నం, పఠాన్‌ చెరు నియోజకవర్గాల్లో కవర్ చేసే అవకాశం ఉంది. వీటిపై మంగళవారమే క్లారిటీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి ఆ స్థానాలు ఏమిటో ఎవరికీ కేటాయించనున్నారో.

mahakutami