సీనియర్ నటి ఉషారాణి కన్నుమూత..!

దక్షణాది సీనియర్ నటి ఉషారాణి ఇకలేదు. గతకొద్దిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె తాజాగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఆమె కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ విషయం తెలియగానే సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.

అయితే తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 200వరకు సినిమాల్లో నటించిన ఆమె దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు పొందారు. ఎన్నై పోల్ ఒరువన్, మన్నవ, పాత్రమ్, హిట్లర్, స్వర్ణ కిరీడం, మలయేథుమ్ మున్పె, కన్మదం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఉషారాణి కొన్ని టీవీ సిరియల్స్ లలో కూడా నటించి బుల్లితెర ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.

అంతేకాకుండా 2004లో చివరిసారి మైలాటం అనే సినిమాలో దర్శనమిచ్చారు. మలయాళ దర్శకుడు, దివంగత శంకర్ నాయర్ ను‌ 1971సంవత్సరంలో ఆమె వివాహం చేసుకున్నారు. ఉషారాణి మృతికి పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, జయసూర్య వంటి మాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.