బిల్డింగ్ మీద నుండి దూకి తెలుగు యాంకర్ ఆత్మహత్య

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఇటీవలి కాలంలో ఆత్మహత్య అనేది సర్వ సాధారణం అయిపోయింది. మన పూర్వీకులు సహా భారత దేశ చట్టం ఆత్మహత్య అనేది మహా పాపమని అదొక నేరమని ఎంత చెబుతున్నా కొందరు బలహీన మనస్కులు ఆత్మహత్య వైపే మొగ్గు చూపుతున్నారు.

తాజాగా తెలుగు న్యూస్ ఛానెల్ v6 కి చెందిన ఒక యాంకర్ తన నివాసం ఉండే మూసాపేట శ్రీవిల్లా అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు మీద నుండి కిందకీ దూకి తనువు చాలించింది. ప్రస్తుతం టాప్ టెన్ లో ఒకటి గా దూసుకెళ్తున్న సదరు ఛానెల్ లో పని చేస్తున్న రాధికా రెడ్డి అనే న్యూస్ యాంకర్, తనకున్న వ్యక్తిగత సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

చిన్న ఉద్యోగిని గా తన కెరియర్ ప్రారంభించిన ఆమె న్యూస్ రీడర్స్ లో టాప్ పొజిషన్ కి ఎదిగారు. ఇదేక్రమంలో ఆమెకి పెళ్లి కావడం ఒక బాబు జన్మించడం కూడా వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే వారి సంతానం గా జన్మించిన ఆ బాబు మెంటల్ గా ఎదగలేని కారణం గా భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి అని తెలుస్తోంది.

అయితే ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తమ సహోద్యోగిని మరణించింది అని తెలుసుకున్న v6 ఉద్యోగులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.