మోడీ, హిట్లర్ సేమ్ టు సేమ్ అట…వర్మ లెక్క

గత కొన్ని వారాలుగా ఏపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్ వ‌ర్మ రూట్ మార్చారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ను విడుద‌ల చేయ‌వ‌ద్ద‌ని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో, అప్పటివరకూ ఊరికనే కూర్చోవడం ఎందుకని అనుకున్నాడో ఏమో, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. జర్మన్ నియంత, సెకండ్ వరల్డ్ వార్ మొదలు కావడానికి కారణమైన అడాల్ఫ్ హిట్లర్, మోదీ సేమ్ టూ సేమ్ అంటూ ఓ ఫోటో విడుదల చేశారు. అప్పట్లో హిట్లర్ ఓ చిన్నపాప చెవులను పట్టుకుని ఉండగా, మోదీ ఇటీవల అదే విధమైన ఫోజ్ తో చిన్నారితో ఉన్న ఫోటోను పక్కపక్కన పెట్టారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.