Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెంకటేష్ ఒకేసారి రెండు మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు కమిట్ అయ్యాడు. రెండు మల్టీస్టారర్ చిత్రాల్లో ఒకటి మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఆ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా దిల్రాజు నిర్మిస్తున్నాడు. వెంకటేష్తో కలిసి వరుణ్ తేజ్ ఆ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ చిత్రంలో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్ తేజ్కు జోడీగా మెహ్రీన్లను హీరోయిన్స్గా ఎంపిక చేయడం జరిగింది. తాజాగా మరో మల్టీస్టారర్కు రంగం సిద్దం అయ్యింది. నాగచైతన్యతో కలిసి వెంకటేష్ సినిమా చేస్తాడంటూ గత రెండు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతుంది. అది ఇప్పటికి వర్కౌట్ కాబోతుంది.
వెంకటేష్, నాగచైతన్యలు రియల్ లైఫ్లో మేనమామ అల్లుడు అనే విషయం తెల్సిందే. సినిమాలో కూడా మేనమామ మేనల్లుడిగానే కనిపించబోతున్నారు. బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకీకి జోడీగా నయనతారను, చైతూకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేయడం జరిగింది. వెంకీ, నయన్ల జోడీకి సక్సెస్ పెయిర్గా గుర్తింపు ఉంది. అలాగే చైతూ, రకుల్లు ఇప్పటికే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో మెప్పించారు. సక్సెస్ జంటలు రెండు ఈ చిత్రంలో ఉండటంతో మస్త్ రొమాన్స్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ‘జైలవకుశ’ చిత్రం తర్వాత దర్శకుడు బాబీ ఇప్పటి వరకు మరో సినిమాను కమిట్ కాలేదు. ఇన్నాళ్లకు మల్టీస్టారర్ను చేసే అవకాశం దక్కింది. వెంకీ చేస్తున్న రెండు మల్టీస్టారర్ చిత్రాలు కూడా ఇదే సంవత్సరంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.