మామ అల్లుడి దర్శకుడు మారాడుగా….

Bobby to Direct Venkatesh and Naga Chaitanya Multistarrer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేసి ‘పవర్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన దర్శకుడు బాబీ గత సంవత్సరం ‘జై లవకుశ’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చేసిన మూడు చిత్రాలు కూడా మూడు రకాల ఫలితాలు దక్కించుకోవడంతో ఈయన కెరీర్‌ అంత ఆశాజనకంగా సాగడం లేదు. ‘జైలవకుశ’ చిత్రం సక్సెస్‌ అయినా కూడా ఎన్టీఆర్‌ క్రేజ్‌ వల్లే అది సాధ్యం అయ్యిందని అంతా అనుకుంటున్నారు. ఆ చిత్రం సక్సెస్‌ క్రెడిట్‌ దర్శకుడు బాబీకి దక్కలేదు. ఆ కారణంగానే బాబీకి ఇప్పటి వరకు ఆఫర్‌ రాలేదు. పలువురు హీరోకు ఈయన కథలు చెప్పినా ఏ ఒక్క హీరో కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఒక చిత్రం బాబీ వద్దకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

చాలా రోజులుగా నాగచైతన్య మరియు వెంకటేష్‌ల కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రానికి కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కళ్యాణ్‌ కృష్ణ స్థానంలో ఆ చిత్రాన్ని బాబీ డైరెక్ట్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య చేస్తున్న రెండు చిత్రాలు ‘సవ్యసాచి’ మరియు ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాలు విడుదలైన తర్వాత ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ మామ అల్లుడి మల్టీస్టారర్‌ చిత్రానికి బాబీ అయితే న్యాయం చేయగలడని నిర్మాత సురేష్‌బాబు అభిప్రాయం వ్యక్తం చేయగా ఆయనకు ఛాన్స్‌ దక్కింది. ఈ చిత్రంతో అయినా బాబీ ఫుల్‌ క్రెడిట్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.