కెరీర్‌ స్వయంగా నాశనం చేసుకుంది

Sai Pallavi Misses Many Movie Chances herself

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ సాయి పల్లవి రెండవ చిత్రాన్ని నానితో చేసింది. నానితో చేసిన ‘ఎంసీఏ’ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సాయి పల్లవి క్రేజ్‌ మరింతగా పెరిగింది. సాయి పల్లవి వరుసగా సక్సెస్‌లను దక్కించుకున్న నేపథ్యంలో ఆమెతో సినిమాలు నిర్మించేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ‘ఫిదా’ చిత్రం సమయంలోనే దిల్‌రాజు ఈమెతో రెండు మూడు సినిమాలకు ఒప్పందం చేసుకున్నాడు. సతీష్‌ వేగెశ్న దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్‌గా ఒక చిత్రం చేయాలని దిల్‌రాజు భావించాడు. కాని ఆ చిత్రంలో నటించను అంటూ తేల్చి చెప్పింది.

దిల్‌రాజు బ్యానర్‌లో సినిమాకు నో చెప్పి అందరికి షాక్‌ ఇచ్చింది. కేవలం దాన్ని మాత్రమే కాకుండా ఇంకా పలు చిత్రాలకు కూడా సాయి పల్లవి నో చెప్పింది. తమిళంలో ప్రస్తుతం స్టార్‌ హీరోకు జోడీగా నటిస్తున్న సాయి పల్లవి తెలుగులో పలు మంచి ఆఫర్లకు నో చెప్పింది. ఇలా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటుంది. సాయి పల్లవి వద్దనుకున్న సతీష్‌ వేగెశ్న చిత్రం శ్రీనివాస కళ్యాణంలో రాశిఖన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇటీవలే ఈ అమ్మడు ‘తొలిప్రేమ’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. తొలిప్రేమ చిత్రంలో తన అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించిన రాశిఖన్నాకు ఈ ఆఫర్‌ దక్కింది. దిల్‌రాజు, సతీష్‌ వేగెశ్నల కాంబినేషన్‌లో వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో మరోసారి వీరి కాంబో మూవీకి భారీ హైప్‌ ఉంది. ఇలాంటి చిత్రంలో సాయి పల్లవి నటిస్తే ఆమె కెరీర్‌కు మంచి హెల్ప్‌ అయ్యేది. కాని సాయి పల్లవి హెడ్‌ వెయిట్‌తో మంచి ఆఫర్లను వదిలేసింది.