‘రామాయణ’ పై నిర్మాత నమిత్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

'రామాయణ' పై నిర్మాత నమిత్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
'రామాయణ' పై నిర్మాత నమిత్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న మెగా బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా ఇటీవల మాట్లాడుతూ, శ్రీరాముడి పాత్రకు రణబీర్ కపూర్ అన్ని విధాలా సరైన ఛాయిస్ అని పేర్కొన్నారు. రణబీర్‌ను ఈ తరంలో అత్యుత్తమ నటుడిగా కొనియాడిన నమిత్, తమ తండ్రుల కాలం నాటి స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ దశాబ్దాల తర్వాత ఇలాంటి గొప్ప పురాణ గాథను కలిసి చెప్పగలగడం అద్భుతమైన అనుభవమని హృదయపూర్వకంగా తెలిపారు.

భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న దృఢమైన లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నమిత్ స్పష్టం చేశారు. వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న మన సినీ పరిశ్రమ ఏటా వెయ్యికి పైగా చిత్రాలు నిర్మిస్తున్నా పశ్చిమ దేశాల్లో ఇంకా బలమైన గుర్తింపు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రామాయణాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకూ చేర్చడమే తమ లక్ష్యమని, ఇది కేవలం ఒక సమాజానికో, వర్గానికో చెందినది కాదని — ఇది అందరి రాముడు, అందరి రామాయణం అని నమిత్ గర్వంగా ప్రకటించారు.