బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’(Ramayana). దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో, హాలీవుడ్ స్థాయి విజువల్స్తో రూపొందిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా కనిపించనుండటంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా క్లైమాక్స్కు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రామాయణ’ క్లైమాక్స్ను భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కథలోని కీలక భావోద్వేగాలు, యాక్షన్, అడ్వెంచర్ అంశాలు క్లైమాక్స్లో మరింత ఉత్కంఠభరితంగా ఉండేలా మేకర్స్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారట.
ముఖ్యంగా సముద్రం, మంచు పర్వతాల నేపథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో ఈ సన్నివేశాలను తెరకెక్కించి ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించేందుకు చిత్రబృందం భారీగా ఖర్చు చేస్తోందని సమాచారం. క్లైమాక్స్ సినిమాకు ప్రధాన హైలైట్గా నిలిచేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఈ భారీ చిత్రంలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, గ్రాండ్ విజువల్స్తో తెరకెక్కుతున్న ‘రామాయణ’పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరి తెరపై ఈ సినిమా ఎలాంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందో చూడాలి.






