ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టుల్లో ‘రామాయణ’ Ramayana ఒకటి. భారీ బడ్జెట్తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఐమాక్స్ వెర్షన్లోనూ గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
‘రామాయణ’ను మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇండియాలో మాత్రం ఈ సినిమా నవంబర్ 8న థియేటర్లలోకి రానుంది.
అయితే ఇప్పుడు ‘రామాయణ’ పార్ట్ 1 రిలీజ్కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన తేదీల కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమా ఓ దేశంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకర్స్ తాజా సమాచారం ప్రకారం, ‘రామాయణ’ పార్ట్ 1ను సింగపూర్లో నవంబర్ 5న విడుదల చేయనున్నట్లు ఖరారు చేశారు.
దీంతో ప్రస్తుతం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముందుగా సింగపూర్లోనే ‘రామాయణ’ పార్ట్ 1 ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అంటే నవంబర్ 6న ప్రపంచవ్యాప్త విడుదలకు ముందే సింగపూర్ ప్రేక్షకులు ఈ భారీ చిత్రాన్ని వీక్షించే అవకాశం పొందనున్నారు.
ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ ఆసక్తి నెలకొంది.






