దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ (Sharwanand) కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’ పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
సినిమాలో ఒక పాత్ర పీరియాడిక్ నేపథ్యంలో సాగుతుండగా, మరో పాత్ర ప్రస్తుత కాలానికి సంబంధించిన రెగ్యులర్ హీరో పాత్రగా ఉంటుందని సమాచారం. ఈ రెండు పాత్రల్లో శర్వానంద్ పూర్తిగా భిన్నమైన లుక్స్, మేకోవర్తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ పూర్తైన అనంతరం జరగనున్న రెండో షెడ్యూల్లో శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సేపై కీలకమైన లవ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘విశ్వం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈసారి ‘జార్జ్ క్రిష్’తో బలమైన కమ్బ్యాక్ ఇవ్వాలని దర్శకుడు శ్రీను వైట్ల గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.






