ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల తేదీ విషయంలో మేకర్స్ ఎలాంటి తొందరపడటం లేదని తెలుస్తోంది. మరో మూడు నెలలకు పైగా చిత్రీకరణ మిగిలి ఉండటంతో పాటు, భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం చిత్రబృందం దీపికా పదుకొణెకు సంబంధించిన సన్నివేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆమె షెడ్యూల్ను ముందుగానే పూర్తి చేసేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ క్యామియో చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, వాటిలో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న AA23 ప్రాజెక్ట్ గురించిన ప్రచారాలపైనా క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది. అలాగే, పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైందన్న ప్రచారం కూడా నిజం కాదని సమాచారం.
ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన ‘డిసి’ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉండగా, అవి పూర్తయ్యాక వచ్చే నెల నుంచి AA23 ప్రీ ప్రొడక్షన్ పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు సమాచారం.






