విజయ్ దరిద్రం రష్మికకు పట్టుకుందన్న వేణుస్వామి!

tollywood movie
Vijay devarakonda

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీరిద్దరు నటించిన మొదటి సినిమా ”గీతా గోవిందం” వీరిద్దరి నటన ఇందులో చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా అనంతరం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే స్టార్ హీరోలు, హీరోయిన్ల జాతకాలు చెప్పేటువంటి వేణుస్వామి వీరిద్దరి గురించి ఆసక్తికరమైన వాక్యాలు చేశాడు.

ఈ వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. రష్మిక వద్దని చెప్పిన విజయ్ తో ఎఫైర్ పెట్టుకుంది. దాని ఫలితంగా విజయ్ కి ప్రస్తుతానికి దరిద్ర గడియలు మొదలైన సమయంలో రష్మిక ఎఫ్ఫైర్ పెట్టుకోవడం తో తన ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా రష్మికకు చుట్టుకుంది అని వేణుస్వామి అన్నారు. పలు గొడవల్లో రష్మిక ఇరుక్కోవడం, కన్నడ పరిశ్రమ తనను బ్యాన్ చేయాలని ఆలోచన రావడానికి కూడా కారణం విజయ్ అంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్దరి జాతకాలు అసలు కలవలేదు. అందుకే రష్మిక జాతకం ఇలా మారింది.

విజయ్ తో రిలేషన్ వల్లే తనకు ఇంత దరిద్రం చుట్టుకుంటుంది. మరికొన్ని రోజుల్లో ఇంకా దరిద్రంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. గతంలో వేణుస్వామి చెప్పిన మాటలు విని రష్మిక… రక్షిత్ శెట్టితో వివాహాన్ని రద్దు చేసుకుంది. ఒకప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోయే ముందు వేణు స్వామి మాటలు విన్న రష్మిక వివాహాన్ని రద్దు చేసుకుంది. మరి ఇప్పుడు విజయ్ తో వద్దని చెబుతున్నా కూడా ఎందుకు వినడం లేదంటూ ఆశ్చర్యపోతున్నారు.