కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా Vishwanath and Sons థియేటర్లలో మంచి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు రావడంతో సూర్య అభిమానులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపించారు. అయితే అక్కడ వారికి ఊహించని నిరాశ ఎదురైంది.
ఈ సినిమా సెకండాఫ్లో దాదాపు అర నిమిషానికి పైగా నిడివి ఉన్న ఓ సన్నివేశం ఎలాంటి ఫైనల్ టచ్ లేకుండానే ఓటీటీ వెర్షన్లో కనిపించింది. ఎడిటింగ్ టేబుల్పై ఉన్న రఫ్ ఫుటేజ్ను అలాగే పెట్టేసినట్టుగా ఆ సీన్ కనిపిస్తుండటంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీ రిలీజ్ సమయంలో ఈ సమస్యను సరిచేస్తారని భావించినప్పటికీ, ఇప్పటికీ అదే వెర్షన్ ఉండటంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే మరో అంశం కూడా సూర్య అభిమానులను మరింత నిరాశకు గురిచేసింది. థియేట్రికల్ వెర్షన్లో సూర్య టైటిల్ కార్డు ‘ది వన్’ వచ్చిన సమయంలో ఆయన నటించిన క్రేజీ హిట్ సినిమాల్లోని పాత్రలను చూపించిన విషయం తెలిసిందే. ఇందులో సూర్య కెరీర్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ‘సింగం’లోని నరసింహం పాత్ర కూడా కనిపించింది.
అయితే ఓటీటీ వెర్షన్లో నరసింహం పాత్రను చూపించే సమయంలో మాత్రం పూర్తిగా బ్లాంక్ ఫ్రేమ్ కనిపించింది. దీంతో అభిమానులు ఈ విషయాన్ని గుర్తించి సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎడిటింగ్కు సంబంధించిన సమస్యపై చర్చ జరుగుతుండగా, ఇప్పుడు ఈ బ్లాంక్ ఫ్రేమ్ అంశం కూడా హాట్ టాపిక్గా మారింది.
అసలు ఈ రెండు సమస్యలు ఎందుకు వచ్చాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మేకర్స్ కావాలనే ఇలా చేశారా? లేక ఓటీటీ వెర్షన్ను సిద్ధం చేసే సమయంలో ఏదైనా సాంకేతిక లోపం జరిగిందా? అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈ విషయంపై చిత్ర బృందం లేదా నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.
మొత్తానికి థియేటర్లలో సినిమాను చూసిన ప్రేక్షకులకు పెద్దగా కనిపించని ఈ తేడాలు ఓటీటీలో మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సూర్య అభిమానులు ఈ రెండు అంశాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో, మేకర్స్ దీనిపై స్పందిస్తారా లేదా అనేది చూడాలి.




