కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ Vishwanath and Sons ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమయంలో మంచి స్పందనను సొంతం చేసుకుంది. యంగ్ హీరోయిన్ మమితా బైజు కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాకు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథ, కుటుంబ భావోద్వేగాలను తెరపై అందంగా చూపించడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మాస్ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సూర్య, ఈసారి పూర్తిగా భిన్నమైన ఫ్యామిలీ ఎమోషనల్ కథతో మెప్పించాడు. క్లాస్ టచ్ ఉన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది. ఏకంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సూర్య కెరీర్లో మరో సక్సెస్ఫుల్ చిత్రంగా నిలిచిందనే టాక్ వచ్చింది.
థియేటర్లలో విజయాన్ని అందుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో వీక్షించవచ్చు. థియేటర్లలో సినిమా మిస్ అయిన సూర్య అభిమానులు, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ను ఇష్టపడేవారు ఇప్పుడు ఇంటి నుంచే ఈ చిత్రాన్ని చూసే అవకాశం దక్కింది.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.



