ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం

ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం

మరికొన్నిగంటల్లో అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకోనున్నారు. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. తన సతీమణి మెలానియా, కూతురు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌ సహా ప్రతినిధుల బ‌ృందంతో వస్తోన్నారు. ట్రంప్ భారత పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘ఇది మనకు అతిపెద్ద ఘటన, దేశ ప్రజలతోపాటు నేను కూడా ట్రంప్ రాక కోసం ఎదురుచూస్తున్నాను అని’ మోడీ ట్వీట్ చేశారు.

యూఎస్ఏ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. నిన్న అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నుంచి ట్రంప్ తన కుటుంబ సభ్యులు, ప్రతినిధులతో ఏయిర్ పోర్స్ వన్ విమానంలో బయలుదేరిన విషయం తెలిసిందే.విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. భారత త్రివిధ దళాలు ట్రంప్ దంపతులకు వందనం చేశాయి. గుజరాత్ సంప్రదాయ రీతిలో సాదరంగా స్వాగతించాయి. ట్రంప్ వెళ్లే కార్పెట్ కు ఇరువైపులా కళాకారులు నిల్చుని ఉన్నారు.