నాగార్జున సాగర్‌కు పోటెత్తుతోన్న వరద

నాగార్జున సాగర్‌కు పోటెత్తుతోన్న వరద

నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది. డ్యామ్ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులగా ఉంది. సాగర్‌ నీటి సామర్థ్యం 312  టీకాగా ప్రస్తుతం 306.69 టీఎంసీలుగా నీరు ఉంది. వరద అంతకంతకు పెరుగుతుండటంతో మరోసారి నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ముందస్తుగా 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. మరో రెండురోజులు పాటు వరద కొనసాగే అవకాశం ఉంది.