ముస్లింలు కళ్లకు ‘సుర్మా’ ఎందుకు పెట్టించుకుంటారు ?

Why do Indian Muslim men use surma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రంజాన్‌ నెలలో ముస్లింలు ఎక్కువగా సుర్మా వాడతారు. ఈ సుర్మాని హైదరాబాద్ మాకా మసీదుకి వెళ్ళిన వారు అందరూ గమనించే ఉంటారు. ఇది కాటుకలా కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్‌ రూపంలో నల్లగా ఉంటుంది. ఇది కళ్లకు కొత్త అందాన్ని తీసుకొస్తుంది. కంటికి సుర్మా పెట్టుకోవడం వల్ల తేజస్సు పెరగడంతోపాటు చలువనిస్తుంది. కళ్లలో పడిన దూళి సైతం బయటికి వచ్చేస్తుంది. అందుకే ఈ మాసంలో ఎక్కువగా సుర్మాను వినియోగిస్తారు.

ప్రవక్త మూసా తొలిసారి దీనిని వాడారు. అరబ్‌ దేశంలోని మరాఖిష్‌ ప్రాంతంలోని కోహితూర్‌ పర్వతం భస్మం కావడంతో భూమి నల్లగా మారిందని, అక్కడికెళ్లిన ప్రవక్త మూసా ఆ నల్లటి పౌడర్‌ను కళ్లకు పెట్టుకున్నారని మత పెద్దలు చెబుతారు. తర్వాత మహ్మద్‌ ప్రవక్త కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. రంజాన్‌ మాసంలో ప్రతిరోజు రెండు కళ్లకు సుర్మా పెట్టుకుంటారు. కొహెతుర్‌ పర్వతం రాళ్లే తెప్పించి ముందు గ్రైండింగ్‌ చేసి ఆ తర్వాత గ్రైండింగ్‌ చేసిన రాళ్ల పౌడర్‌ను గుడ్డతో జల్లెడ పడతారు. దానినే సుర్మా అంటారు. నల్లని రాళ్లను పగులగొట్టి, పౌడర్‌గా మారుస్తారు. దీనికి గులాబీ నీరు కలిపి సుర్మా తయారు చేస్తారు. పాతబస్తీకి చెందిన సయ్యది సుర్మాకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అతికొద్ది మంది మాత్రమే ఇప్పుడీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.