బీజీపీకి వోటు వేసిందని భార్యను చంపేసిన భర్త 

murder

రాజకీయాలు పార్టీల మధ్య, రాజకీయ నేతల మధ్యే కాదు, పచ్చని సంసారాల్లో సైతం చిచ్చు రేపుతున్నాయి. అంతులేని విషాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా తాను చెప్పిన అభ్యర్థికి/పార్టీకి ఓటు వేయకుండా బీజేపీకి ఓటు వేసిందనే అక్కసుతో భార్యను దారుణంగా కొట్టి చంపాడో వ్యక్తి. నేరాలకు కేరాఫ్ గా నిలిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాజీపూర్ నియోజకవర్గం పరిధిలోని స్వవానియా గ్రామంలో రాంబచ్ అనే వ్యక్తి తన భార్య నీలంను బీఎస్పీకి ఓటు వేయమని చెప్పాడు, అయితే నీలం బీఎస్పీకి బదులుగా బీజేపీకి ఓటు వేసింది. వేశాక ఊరుకోకుండా ఏదో రెచ్చగొట్టినట్టు తాను బీజేపీకి ఓటు వేశానని ఆమె వెళ్లి భర్తకు చెప్పింది. దీంతో ఆ భర్త ఆమెతో గొడవకు దిగాడు. ఆ మరుసటి రోజు కూడా ఇదే విషయం మీద పెద్ద గొడవే అయింది. దీంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి ఆవేశంతో తన భార్యను కర్రతో కొట్టాడు ఆ వ్యక్తి. అయితే అతను కొట్టిన దెబ్బ్ తలకు బలంగా తగలడంతో నీలం అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కల ఉన్న వాళ్లు అక్కడికి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మధ్యనే ఇలాంటి ఘటన తెలంగాణలో కూడా చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సర్వాయిపేటలో భార్య తాను చెప్పిన అభ్యర్థికి కాకుండా వేరే పార్టీకి చెందిన అభ్యర్థికి ఓటు వేసిందని భార్య వేలుని నరికేశాడు ఒక వ్యక్తి.