హైదరాబాద్ నడిబొడ్డున కాళ్ళు నరికి యువతీ దారుణ హత్య !

Woman killed in Erragadda Mental Hospital inside

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఈరోజు దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.  నగరంలోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ఆవరణలో మహిళను దారుణంగా హత్య చేశారు. ఆసుపత్రి ఆవరణలో మహిళల మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారం ప్రకారం గుర్తు తెలియని దుండగులు ఓ మహిళ రెండు కాళ్లను అత్యంత దారుణంగా నరికి హత్య చేశారు. ఆసుపత్రి భవనంపై నరికిన కాళ్ల ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులకి ఆసుపత్రి వర్గాలు సమాచారం అందించాయి. దీంతో ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతిరాలి వయసు దాదాపు 35 సంవత్సరాలు ఉన్నట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకి వచ్చారు. ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.