మొగుడి కళ్ళలో కారం కొట్టి ప్రియుడితో పరార్

Illicit Affair killed Two Children At Kurnool

వివాహేతర సంబంధం హత్యాయత్నానికి దారితీసిన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. గుడివాడలోని వాంబే కాలనీలో నివాసముంటున్న కోసూరు మురళీకృష్ణ భార్యతో గొడవపడి కొంతకాలంగా వేరుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ భార్య ఏ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గోకరాజు అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మురళీకృష్ణ గోకరాజును ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వాంబే కాలనీలో తన భార్యతో గోకరాజు ఉండటాన్ని మురళీకృష్ణ గుర్తించాడు. కత్తితో అతనిపై ఒక్కసారిగా విచక్షణ రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడిలో గోకరాజు ఛాతిభాగం, కంటిపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ క్రమంలో తేరుకున్న మురళీకృష్ణ భార్య భర్త కళ్లల్లో కారం చల్లి ప్రియుడితో సహా పరారైంది. దీంతో మురళీకృష్ణ ఆగ్రహంతో గోకరాజు బైక్‌కు నిప్పు పెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గుడివాడ పోలీసులు బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. నిందితుడు మురళీకృష్ణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.