లవర్ ఇంట్లో దూలానికి సూసైడ్…హత్యా ? ఆత్మహత్యా ?

Man commited suicide

ప్రియురాలి ఇంట్లో ఓ ప్రియుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంగల్లులో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మదనపల్లె మండలం కమతంపల్లెకు చెందిన శశికుమార్‌, అంగల్లుకు చెందిన ఐశ్వర్యలు రెండేళ్లు ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమను రెండు కుటుంబాల్లో పెద్దలు అంగీకరించలేదు. ఇద్దరూ ఇకపై కలవకూడదని హుకుం జారీ చేశారు. తర్వాత కూడా ఈ జంట తరచూ కలుస్తుండటంతో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు కూడా చేరగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ వివాదం ఓవైపు నడుస్తుండగానే.. ఆదివారం మధ్యాహ్నం శశికుమార్ ప్రియురాలి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నట్లు యువతి తరపు బంధువులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శశికుమార్ ది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతడు ప్రియురాలి ఇంటికి ఎందుకు వెళ్లాడు.. అక్కడ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు అనుమానాలు ఉన్నాయని.. ఈ కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నారు.