సురేఖ వాణి ఇంట తీవ్ర విషాదం…

సినీ నటి సురేఖా వాణి భర్త సురేష్ తేజ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం ఉదయం చనిపోయారు. సురేష్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఛాన‌ల్ ప్రోగ్రామింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే సురేష్ పరిచయం అయ్యారు. తర్వాత ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సురేష్ తేజ డైరెక్షన్‌లోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలకు సురేఖా వాణి యాంకరింగ్ చేశారు. అలాగే ఎన్నో టీవీ కార్యక్రమాలకు సురేష్ దర్శకుడిగా వ్యవహరించారు. తర్వాత టాలీవుడ్ సినిమా ఛానల్ పోగ్రామింగ్ హెడ్‌గా ఉన్నారు. సురేఖా వాణి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. వీరికి ఒక పాప ఉంది.