ఉపరాష్ట్రపతి అయినా ఉత్తమ మంత్రే

Venkayya Naidu As 4th Best Minister

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Venkayya Naidu As 4th Best Minister

వెంకయ్యనాయుడ్ని దేశ ప్రజలు ఇంకా కేంద్రమంత్రిగానే చూస్తున్నారా. ఆయన ఉపరాష్ట్రపతి అనే విషయం చాలా మందికి రిజిస్టర్ కావడం లేదు. ఎందుకంటే వెంకయ్య ఉపరాష్ట్రపతి ఆఫీస్ కు వెళ్లాక జరిగిన సర్వేలో కూడా ఉత్తమ మంత్రుల్లో వెంకయ్యకు నాలుగో స్థానం దక్కింది. మొదట జైట్లీ, రెండో స్థానంలో రాజ్ నాథ్, మూడో స్థానంలో సుష్మ, నాలుగో స్థానంలో వెంకయ్య ఉన్నారు.

గత ఏడాదితో పోలిస్తే మోడీ పాపులారిటీ ఇంకా పెరిగింది. ఆయన పనితీరు విషయంలో మిగతా వారికి అందనంత ఎత్తులో ఉన్నారు. వెంకయ్యకు ఇచ్చిన శాఖలతో ఆయన టాప్ ఫోర్లో ఉండటం చిన్న విషయం కాదని బీజేపీ వర్గాలంటున్నాయి. ఆర్థిక, హోం, విదేశాంగ శాఖలకు మంచి వ్యక్తులు మంత్రులుగా ఉంటే.. సహజంగా వాళ్లే టాప్ ప్లేస్ లో ఉంటారు. ఎందుకంటే ఆశాఖలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.

కానీ సమాచార ప్రసార శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్య తన స్మార్ట్ సిటీస్ ప్లాన్ తో దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చారు. అమృత్ పథకం స్వచ్ఛభారత్ కు దీటుగా జనంలోకి వెళ్లింది. అందుకే ఆయన టాప్ ఫోర్ లో చోటు దక్కించుకున్నారు. వెంకయ్యకు కీలక శాఖ అప్పగిస్తే ఆయనే నంబర్ వన్ లో ఉండేవారని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు.