రూటు మార్చిన రామోజీ

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే.. రామోజీరావు రూటు మార్చినట్లు కనిపిస్తోంది. మీడియా మొఘల్ అయినా స్వోత్కర్షకు దూరంగా ఉండే రామోజీ.. తొలిసారి మనవరాలి పెళ్లి మాత్రం తన ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.

మలిదశలో తనకు ప్రచారం తగ్గిందని రామోజీ తాపత్రయపడుతున్నారని ఆయన విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. ఎప్పుడూ అధికారానికి, అధికారులకు దూరంగా ఉండే రామోజీ.. ఈ మధ్య వారితో కూడా రాసుకుపూసుకు తిరుగుతున్నారని ప్రస్తావిస్తున్నారు. ఇక స్వచ్ఛభారత్ ప్రచారం గురించి ప్రధాని మోడీని ఎన్నిసార్లు కలిశారో లెక్కేలేదు.

ఈటీవీ ఛానెళ్లలో రామోజీ ఫంక్షన్లు ఏవైనా ఒకట్రెండు ఫోటోలతో సరిపెడతారు. కానీ రామోజీ మనవరాలు సహరి పెళ్లి వేడుక మాత్రం బాగా ప్రాధాన్యత ఇచ్చి హైప్ చేశారు. ఇతర మీడియా సంస్థలకు కూడా ఫీడ్ పంపించారు. దీంతో రామోజీ రూటు మార్చారని స్పష్టమైపోతోంది.

మరిన్ని వార్తలు:

కెసిఆర్ డైలాగు తో గాల్లో తేలుతున్న జగన్… ఫ్లాష్ బ్యాక్ ప్లీజ్.