ఈ ఎన్నికలు TDPకి అగ్ని పరీక్షే..తెలంగాణ రిజల్ట్‌.. ఆంధ్రాలో ఎఫెక్ట్‌..!

This election is a litmus test for TDP..Telangana result..Effect in Andhra..!
This election is a litmus test for TDP..Telangana result..Effect in Andhra..!

తెలంగాణ తెలుగు దేశం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామని ప్రకటించారు. ముఖ్య నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. లిస్ట్‌ ప్రకటించిన తర్వాత చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర కూడా చేయాలని సూచించినట్లు వెల్లడించారు.

నిలిచేదెవరు.. గెలిచేదెవరు..

పోటీ చేస్తామనడం వరకు బాగానే ఉంది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీటీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. 2004 తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాలేదు. మరోవైపు 2014 తర్వాత పార్టీ నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు క్రమంగా టీఆర్‌ఎస్‌లో చేరుతూ వచ్చారు. గతేడాది రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌రమణ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌,ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్లు టీడీపీని వీడారు. రేవంత్‌రెడ్డ కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిస్థితిలో టీడీపీకి క్యాడర్‌ఉన్నా లీడర్లు లేరు. ఇలాంటి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో బరిలో నిలిచేందుకు అభ్యర్థులు దొరుకుతారా.. దొరికినా గెలుస్తారా అన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక్కడ గెలిచి.. అక్కడ సత్తా చాటాలని..

వాస్తవానికి టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. విజన్‌ 2020 పేరుతో చంద్రబాబు సీఎంగా అభివృద్ధి పనులు చేపట్టారు. హైటెక్‌సిటీ, ఎత్తయిన భవనాలు ,ఫ్లై ఓవర్లు, రింగ్‌ రోడ్డు, నిర్మించారు. నేడు తెలంగాణ ఆర్థికంగా దూసుకుపోవడానికి, అభివృద్ధికి నాటిన తన విజనేకారణమని చెబుతున్నారు. కానీ, నాడు తలసరి ఆదాయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవలేదు. ఆదాయం పెరగలేదు. పంటల దిగుబడి పెరుగలేదు. అయినా..చంద్రబాబు తెలంగాణలో క్యాడర్‌ బలంగా ఉన్నందున అన్ని స్థానాల్లో పోటీకి కూడా సుముఖంగా ఉన్నారు. దీని వెనుక చంద్రబాబు వ్యూహం కూడా వేరే ఉందంటున్నారు విశ్లేషకులు, ఇక్కడ కనీసం నాలుగైదు స్థానాలు గెలిచి ఆఫలితాలు చూసి ఆంధ్రాల్లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్, ఖమ్మంపై దృష్టి..

హైదరాబాద్‌తో తాను చేసిన అభివృద్ధి ఇప్పటికీ చెక్కు చెదరలేదని, రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, మేడ్చెల్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆంధ్రా ప్రభావం, సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో బాబుకి గెలుపు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇక టీడీపీకి ఆంధ్రా సరిహద్దులో ఉన్న ఖమ్మంలో కూడా పట్టు ఉంది. ఇటీవల నిర్వహించిన సభకు భారీగా నాయకులు తరలి వచ్చారు. దీంతో కొన్ని సీట్లు ఖమ్మంలో గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 అసెంబ్లీ స్థానాలైనా గెలవాలని బాబు భావిస్తున్నారు. ఈమేరకు అభ్యర్థులను ప్రకటించిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కు బస్సు యాత్ర కూడా చేపట్టాలని సూచించారు.

మరి బాబు కొరిక ఏమాత్రం నెరవేరుతుందో చూడాలి. ఒకవేళ ఈసారి టీడీపీకి సీట్లు రాకపోయినా, వచ్చిన. దాని ప్రభావం మాత్రం ఆంధ్రాలో కచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అది అధికార వైసీపీకి ఆయుధం అవుతుందని తెలిపారు.