కేన్సర్ బాధితుల క్లినికల్ ట్రయల్స్ సక్సెస్, ఔషధంతో నయమైన మహమ్మారి…..

కేన్సర్ పరిశోధనల్లో విజయం లభించింది ,చికిత్సలతో పనిలేకుండా ఒక్క ఔషధంతో కేన్సర్‌ను పూర్తిగా నయం చేయడంలో పరిశోధకులు సఫలమయ్యారు .

క్యాన్సర్‌ చరిత్రలోనే తొలిసారిగా 18 మంది రెక్టార్ కేన్సర్ బాధితులు వ్యాధి నుంచి సంపూర్ణంగా స్వస్థత పొందారు.. చికిత్స పొందిన ప్రతి ఒక్కరిలోనూ ఇదే ఫలితం కనిపించడం వల్ల ఆనందంతో మా కళ్లు చెమ్మగిల్లాయి’’ అని పరిశోధకులు పేర్కొన్నారు.

రెక్టల్ (పురీషనాళ) కేన్సర్‌ బాధితులు తదుపరి చికిత్స కూడా అవసరం లేకుండానే ‘డోస్టార్లిమాబ్‌’ ఔషధంతో కోలుకున్నారని, ఈ ఫలితాన్ని తాము కూడా ఊహించలేదని పరిశోధకులు వెల్లడించారు.