శ్రీలంక  ఉత్సవాల్లో అపశృతి

శ్రీలంక  ఉత్సవాల్లో అపశృతి

శ్రీలంకలో జరిగిన ఓ వేడుకల్లో అపశ్రతి చోటు చేసుకుంది. శ్రీ జయవర్ధనపుర ఉత్సవాల్లో భాగంగా ఏనుగుతో పరేడ్ నిర్వహిస్తుండగా రెండు ఏనుగులు ఒక్కసారిగా జనాలను తొక్కుకుంటూ దూసుకెళ్లిపోయాయి. ఈ ఘటనలో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో 12 మంది మహిళలు ఉన్నారు. జిగేలు మణిపించే  విద్యుత్ కాంతుల మధ్య, సుందరంగా అలంకరించిన ఏనుగులను డప్పు, వాయిద్యాలతో పరేడ్‌లో తిప్పుతున్నారు. అయితే ఉన్నట్టుండి కోపం తెచ్చుకున్న ఏనుగులు తమ తొండంతో జనాలను విసురుకుంటూ ఒక్కసారిగా పరుగు తీసింది. ఈ ఘటనలో తొక్కిసలాట జరిగి కొందరు, ఏనుగు కాళ్ల కింద పడి మరికొందరు గాయాలపాలయ్యారు.