ప్రమాద స్థాయిలో  తుంగభద్ర

ప్రమాద స్థాయిలో  తుంగభద్ర

మంత్రాలయంలో తుంగభద్ర నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. భక్తులు నదిలోకి వెళ్లి స్నానాలు చేయకూడదని అప్రమత్తం చేస్తున్నారు శ్రీ మఠం అధికారులు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గత వారం రోజులుగా భారీగా వర్షాలు కురవడంతో తుంగభద్ర జలాశయంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో.. హొస్పెట్ డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. నది తీర లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని రెవిన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.