వరంగల్ లో 100క్వింటాళ్ల అక్రమ తరలింపు బియ్యం సీజ్..

rice

ఓ పరిశ్రమలోకి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పసిగట్టి పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కార్తికేయ ఇండస్ట్రీస్‌లోకి 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఆ సమాచారాన్ని పసిగట్టి తెలిసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రైడ్‌ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా 4 టాటా ఏసీ వాహనాలు, ఒక బొలేరో, ఒక ప్యాసింజర్‌ ఆటో, 8 బైక్‌లను సీజ్‌ చేశారు. బియ్యం తరలిస్తున్న 21 మందితో పాటు మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.