బీజేపీ వ్యూహం సిద్ధం.. రంగంలోకి 40 మంది

40-BJP-Leaders-Campaign-In-

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పరువు నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కనీస సీట్లను గెలిపించుకునేందుకు రాష్ట్రనేతలతో పాటు జాతీయ స్థాయి నేతలను మోహరిస్తూ ప్రణాళిక రూపొందించారు. అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశారు కాబట్టి ఇక మిగిలింది ప్రచారమే. ప్రజలను ఆకట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించి ఓట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను బీజేపీలోని కొంతమంది ప్రధాన నేతలకు అధిష్టానం అప్పగించింది. వీరిలో 40 మంది రాష్ట్ర కేంద్ర ముఖ్యులు ఉన్నారు. ఎవరు ఏ రోజు ప్రచారం నిర్వహించాలో షెడ్యూల్ కూడా నిర్ణయించారు. జిల్లా కేంద్రాలతో పాటు పలు నియోజకవర్గాల్లో సభలు – సమావేశాల్లో పాల్గొననున్నారు.

bjp-telangana

స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన వారిలో నరేంద్ర మోదీ, అమిత్‌ షాలతో పాటు రాజ్‌ నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, రామ్‌ లాల్‌, యోగి అదిత్యానాథ్‌, రమణ్‌ సింగ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, నిర్మలా సీతారామన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, డీవీ సదానంద గౌడ, జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, స్మృతి ఇరానీ, పియూష్‌ గోయల్‌, థావర్‌ చంద్‌ గెహ్లాట్‌, పురుషోత్తమ్‌ రూపాలా, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, హన్స్‌ రాజ్‌ గంగారామ్‌, జువల్‌ ఓరం, రామ్ మాధవ్‌, మురళీధర్‌ రావ్‌, హేమమాలిని, బీఎల్‌ సంతోష్‌ తదితరులున్నారు. వీరితో పాటు పీకే కృష్ణదాస్‌, సాయికుమార్‌, కే లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, కిషన్‌ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, స్వామి పరిపూర్ణానంద, ప్రేమెందర్‌ రెడ్డి, చింతా సాంబమూర్తి, జీవితా రాజశేఖర్‌, కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి, కే హరిబాబు, జీవీఎల్‌ నరసింహారావు, మంత్రి శ్రీనివాసులు కూడా ఉన్నారు.

BJP-Leaders