TG Politics: ఇవాళ కేరళలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

TG Politics: Chief Minister Revanth Reddy will visit Kerala today
TG Politics: Chief Minister Revanth Reddy will visit Kerala today

రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్‌ భారీగా పెరిగింది. అందుకే ఆయన ఛరిష్మాను లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని భావించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. అందుకే ఆయనతో తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ ఇవాళ కేరళకు వెళ్లనున్నారు. ఈరోజు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కేరళ చేరుకుంటారు. అక్కడ లోక్సభ ఎన్నికల ప్రచారంలో రెండ్రోజుల పాటు పాల్గొంటారు, కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారు.

తిరిగి ఈనెల 18వ తేదీ రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక 19వ తేదీన మహబూబ్నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగే కాంగ్రెస్ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో రేవంత్తో అధిష్ఠానం ప్రచారం చేయించింది. ఇక ఇప్పుడు ఏపీ, కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోనూ రేవంత్తో ప్రచారం చేయిస్తోంది.