మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (Dragon) పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల షూటింగ్ సమయంలో ఎన్టీఆర్కు స్వల్ప గాయం కావడంతో ఆయన కొద్ది వారాలు విశ్రాంతి తీసుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ లేని సన్నివేశాల చిత్రీకరణను ప్రశాంత్ నీల్ పూర్తి చేస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ‘డ్రాగన్’ షూట్ కోసం మరో స్టార్ హీరో హైదరాబాద్కు చేరుకున్నట్లు సమాచారం. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్. ఇప్పటికే విడుదలైన ‘డ్రాగన్’ గ్లింప్స్లో అనిల్ కపూర్ను పవర్ఫుల్ పాత్రలో పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న తాజా షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.





