మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్లో ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారని, అక్టోబర్ మొదటి వారంలో తిరిగి ‘డ్రాగన్’ షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్పై కూడా మేకర్స్ కొత్త షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ షూటింగ్కు దూరంగా ఉన్న సమయంలో ఆయన అవసరం లేని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెలలోనే ఇతర నటీనటులతో షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూళ్లను రూపొందించారట.
ఎన్టీఆర్ గాయంతో షూటింగ్ షెడ్యూల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ, సినిమాను ముందుగా ప్రకటించిన విడుదల తేదీకి తీసుకురావడమే లక్ష్యంగా చిత్రబృందం పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్రణాళిక ప్రకారం ‘డ్రాగన్’ను Dragon 2027 జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ తన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం కేటాయించే నేపథ్యంలో, షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ భారీ ప్రాజెక్ట్ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘డ్రాగన్’పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.





