మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ పై NTR Dragon ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మరో రెండు వారాల్లో తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్లో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ ప్రాజెక్ట్ మరింత భారీ స్థాయికి వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ బిగ్ స్టార్స్ పేర్లు కూడా ఈ ప్రాజెక్ట్తో వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ‘డ్రాగన్’లో భాగం కానున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో ఎన్టీఆర్ సినిమాకు ఇది మంచి బూస్ట్గా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే షాహిద్ కపూర్కు సంబంధించి మరో ఆసక్తికరమైన రూమర్ కూడా వినిపిస్తోంది. తొలుత మలయాళ నటుడు టోవినో థామస్ పోషించనున్న పాత్రలో షాహిద్ కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ కేవలం రూమర్స్గానే చూడాలి. నిజంగానే షాహిద్ కపూర్, ఆలియా భట్ ఈ ప్రాజెక్ట్లో భాగమవుతున్నారా లేదా అనేది మేకర్స్ నుంచి అధికారిక క్లారిటీ వస్తేనే తెలుస్తుంది.
ఇక ‘డ్రాగన్’కు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్కు తోడు ఈ బాలీవుడ్ స్టార్స్ రూమర్స్తో ‘డ్రాగన్’పై అంచనాలు మరింత పెరిగాయి.




