‘డ్రాగన్’ గ్లింప్స్ కోసం ముంబై బాట పట్టనున్న NTR?

‘డ్రాగన్’ గ్లింప్స్ కోసం ముంబై బాట పట్టనున్న తారక్?
‘డ్రాగన్’ గ్లింప్స్ కోసం ముంబై బాట పట్టనున్న తారక్?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (#NTRNeel) నుంచి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే ఉండగా, అందుకు ముందురోజైన మే 19 అర్ధరాత్రి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈ గ్లింప్స్ లాంచ్ కోసం ఎన్టీఆర్ స్వయంగా ముంబైకి వెళ్లనున్నారని, అక్కడ నేషనల్ మీడియా సమక్షంలో ఫస్ట్ లుక్‌ను అధికారికంగా ప్రెజెంట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సౌత్ సినిమాలకు నార్త్ మార్కెట్‌లో పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా ప్రమోషన్లను ముంబై నుంచే గ్రాండ్‌గా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. కాగా, ‘డ్రాగన్’ను జూన్ 11, 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.