యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు మౌళి తనుజ్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయానంతరం ఆయన తదుపరి ప్రాజెక్ట్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఉండబోతుందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఆ ప్రచారానికి తెరదించుతూ మేకర్స్ ‘దొంగ నా కొడుకు’ (Donga Naa Koduku) పేరుతో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా, సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఈ చిత్రం ఓటీటీ హక్కులు భారీ డీల్కు అమ్ముడైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ డీల్ సినిమాపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తుండగా, ‘లిటిల్ హార్ట్స్’ చిత్రానికి సంగీతం అందించిన సింజిత్ ఎర్రమల్లి మరోసారి స్వరాలు సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
